News

భీవండి కోర్టుకు రాహుల్ గాంధీ


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాసేపట్లో మహారాష్ట్రలోని భీవండి కోర్టు ముందు హాజరుకానున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసు విచారణ ఈరోజు జరుగనుంది. 2014 మార్చి 6న మహాత్మాగాంధీని ఆర్ఎస్ఎస్ చంపిందని రాహుల్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆర్ఎస్ఎస్ నేత ఒకరు రాహుల్‌పై కేసు నమోదు చేశారు. ఇవాళ కోర్టులో దీనిపై విచారణ జరుగనుంది. ఇందుకోసం నిన్న ముంబైకి వచ్చిన రాహుల్ భీవండికి బయలుదేరి వెళ్తున్నారు.